MHBD: తొర్రూరు మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన బోధసు మధుశాలికి వివాహం చేసుకోవడం ఇష్టం లేక ఈనెల 25న గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ.. మృతి చెందింది. మృతురాలి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేందర్ పేర్కొన్నారు.