WGL: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌజ్ అవెన్యూ కోర్టు క్లీన్చిట్ ఇచ్చి, అభియోగాల నుంచి విముక్తి కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా జాగృతి నాయకులు సుశీల్ గౌడ్, రోహిత్ కుమార్ ఇవాళ కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాగృతి నేతలు తదితరులు ఉన్నారు.