ADB: జిల్లా ఓసీ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడిగా డాక్టర్ ప్రఫుల్ వజే, ప్రధాన కార్యదర్శిగా పురుషోత్తం రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కౌటిక్ రాజేశ్వర్ ఎన్నికయ్యారు. బుధవారం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ కొత్త కమిటీని ప్రకటించి, సభ్యులను ఘనంగా సన్మానించారు. ఓసీ వర్గాల ఐక్యతే లక్ష్యమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.