NLG: రాష్ట్రంలో హత్యల కంటే రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య ఆందోళనకరంగా ఉందని DGP శివధర్ రెడ్డి పేర్కొన్నారు. ఏడాదికి 800 మంది హత్యలకు గురవుతుంటే, 7500 మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. నకిరేకల్లో ‘అలైవ్ అరైవ్’ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, నిబంధనలు పాటించాలన్నారు.