MDK: పంట మార్పిడి వల్ల రైతులకు లాభం చేకూరుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో సోమవారం పంట మార్పిడి విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రతిసారి ఒకే పంట వేయడం వల్ల భూసారం తగ్గిపోతుందని తద్వారా దిగుబడి తగ్గుతుందన్నారు. ఆరుతడి పంటలు సాగు చేయడం వల్ల అధిక లాభం వస్తుందని వెల్లడించారు.