MNCL: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా చెన్నూర్ అసెంబ్లీ పరిధిలోని ఈద్గాలు, మసీదులు, ఖబ్రస్తాన్లలో పారిశుధ్య పనులు చేపట్టాలని కోరుతూ.. నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఇలియాజుద్దీన్ మంగళవారం కలెక్టర్ కుమార్ దీపక్కి వినతిపత్రం అందజేశారు. స్పందించిన జిల్లా కలెక్టర్ అవసరమైన పారిశుధ్య పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.