KMR: భిక్కనూర్ మండలం జంగంపల్లిలో విద్యుత్ షాక్తో పెయింటర్ అజీజ్ మృతి చెందారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన అజీజ్ జంగంపల్లిలో ఓ ఇంటికి రంగులు వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ మెయిన్ లైన్ తగిలి ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.