WGL: రాయపర్తి మండల కేంద్రంలో రాజేష్ (28) అనే వ్యక్తి శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. భవన నిర్మాణ కార్మికుడైన అతను ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించగా, కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.