నిర్మల్ పట్టణంలో బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా సోమవారం ఉదయం అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన అమలుకు నోచుకోని హామీలను ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా తెలంగాణ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. హైదరాబాద్కు వెళ్లేందుకు సిద్ధమైన బీజేపీ నేతలను పోలీసులు ఈ సందర్భంగా అదుపులోకి తీసుకున్నారు.