MLG: ఏటూరునాగారం- తాడ్వాయి మండలాల మధ్య ఉరుములు, మెరుపులతో గాలి వాన బీభత్సం సృష్టించింది. రహదారులపై చెట్లు విరిగి పడటంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆర్టీసీ బస్సులు నిలిచిపోగా, విషయం తెలుసుకున్న తాడ్వాయి ఎస్సై చేరుకుని జేసీపీ సహాయంతో చెట్లు తొలగించి మార్గం క్లియర్ చేశారు. ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులకు గురయినట్లు పేర్కొన్నారు.