కరీంనగర్ ఆర్టీసీ 2 డిపోలో జిల్లా స్థాయి మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ.. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని, అలాగే, సంస్థలో మహిళా ఉద్యోగుల సేవలు చాలా గొప్పవని అన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వివిధ స్థాయిలోని మహిళా ఉద్యోగులను సత్కరించారు. ఆర్టీసీ డిప్యూటీ RMలు భూపతి రెడ్డి, మల్లేశం పాల్గొన్నారు.