MLG: మేడారంలో దొంగలు రెచ్చిపోతున్నారు. వనదేవతల గద్దెల ప్రాంగణంలో కిరాణా దుకాణాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నారు. శనివారం అర్ధరాత్రి ఓ దుకాణంలో దొంగలు చొరబడిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇటీవల కాలంలో మేడారంలో దొంగతనాలు ఎక్కువ అయ్యాయని వ్యాపారులు వాపోతున్నారు. పోలీసులు దొంగతనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు.