SDPT: హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్లో శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ కోసం 36 ఎకరాల భూమి కేటాయిస్తూ క్యాబినేట్ నిర్ణయం తీసుకుందని మంత్రి పొన్నం తెలిపారు. అలాగే చిగురు మామిడి మండల కేంద్రంలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నిర్మాణానికి 3.12 ఎకరాలను దేవాదాయ శాఖకు కేటాయిస్తూ క్యాబినేట్ నిర్ణయం తీసుకుందన్నారు.