BHPL: భారత ప్రభుత్వం, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో “ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం” (PMIS) ప్రారంభమైనట్లు పరిశ్రమల శాఖ GM సిద్ధార్థ్ తెలిపారు. ఈ పథకం ద్వారా అగ్రశ్రేణి కంపెనీలలో వేతనంతో కూడిన ఇంటర్న్షిప్ అవకాశాలు యువతకు అందించనున్నారు. BHPL జిల్లాలోని ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.