MDCL: TSRTC కుషాయిగూడ డిపో నుంచి కాశీ యాత్రకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు. ఈ బస్సు మార్చి 28 సాయంత్రం 6 గంటలకు ఈసీఐఎల్ బస్టాండ్ నుంచి బయలుదేరి ఉజ్జయిని, ఓంకారేశ్వర్, అయోధ్య, ప్రయాగ్రాజ్, కాశీ క్షేత్రాలను సందర్శిస్తుందన్నారు. టికెట్ ధర రూ. 8,000 ఉందని తెలిపారు. బుకింగ్ కోసం 9959226145, 9603549388 సంప్రదించాలి పేర్కొన్నారు.