NGKL: రాష్ట్రంలో వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ మంత్రి జూపల్లి కృష్ణారావుకు వడ్డెర సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. వడ్డెరల ఆర్థిక, సామాజికాభివృద్ధికి ప్రభుత్వం చొరవ చూపాలని సంఘం అధ్యక్షుడు మద్దిలేటి కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు జగదీశ్, సత్యనారాయణ పాల్గొన్నారు.