JGL: కథలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలు, సోమవారం ఘనంగా నిర్వహించారు. దేవాలయంలో భక్తులు పూజలు చేసి కొబ్బరికాయాలు కొట్టి, స్వామివారి కళ్యాణం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుంటుక మనోహర్, ఉపసర్పంచ్ గండి తిరుపతి, అర్చకులు మాధవచారీ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.