JGL: ముస్లీం మైనార్టీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల మాతా శిశు కేంద్రంలో హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి సుజాత, జిల్లా ఉప వైద్యాధికారి శ్రీనివాస్, డాక్టర్ విజయ్ రెడ్డి పాల్గొన్నారు.