SDPT: దుబ్బాక 100 పడకల ఆసుపత్రిలో రూ. 25 లక్షల విలువైన గైనకాలజీ ల్యాప్రోస్కోపిక్ పరికరాలను మెదక్ ఎంపీ రఘునందన్ రావు శనివారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత మహిళలకు అత్యాధునిక వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ సదుపాయం కల్పించినట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు స్థానిక మహిళలు శస్త్రచికిత్సల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ ఆసుపత్రిలోనే మెరుగైన సేవలు ఉన్నాయన్నారు.