NGKL: వెల్దండ మండలం చెదురుపల్లిలోని పోస్ట్ ఆఫీస్ను వేరే చోటికి తరలించడంపై సర్పంచ్ ధన్ సింగ్ నాయక్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తమ ఊరి కార్యాలయం తమకే కావాలని, తరలింపునకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అశోక్, తిరుపతయ్య గౌడ్ పాల్గొన్నారు.