ADB: హైదరాబాద్లో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అన్వేష్ రెడ్డిని గురువారం డీసీసీ అధ్యక్షుడు జాదవ్ నరేష్ శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని పలు రైతు సమస్యలపై ఆయనకు వినతిపత్రం అందజేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు సకాలంలో అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.