AP: పల్నాడు జిల్లా కొండవీడు కోటలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరుకు చెందిన మణికంఠ రాజు, ఓ యువతి గత రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. అయితే, వీరి వివాహానికి పెద్దలు అంగీకరించకుండా యువతికి వేరే వ్యక్తితో వివాహం చేశారు. ఈనెల 7న కొండవీడు కోటకు వెళ్లిన వీరు మనస్తాపంతో పురుగుమందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.