వనపర్తిలో బాలికపై అత్యాచార ఘటనపై న్యాయం కోరిన నందిమల్ల అశోక్, చీర్ల చందర్ సహా ఆరుగురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. నిందితుడిని కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్ని, అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. బాధితురాలికి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.