NLG: హాలియాలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై సాయి ప్రశాంత్ తెలిపారు. హాలియాలో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేయగా ఏడుగురు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.53,600 నగదు, ఏడు మొబైల్ పోన్లు, మూడు మోటర్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.