SRD: కంగ్టి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 14-15 ఏళ్ల బాలికలకు హెచ్పీవీ (HPV) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని డాక్టర్ నాగమణి సోమవారం ప్రారంభించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ఈ టీకా ఎంతో కీలకమని ఆమె పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మహిళల ఆరోగ్య రక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అర్హులైన బాలికలందరూ ఈ టీకా వేయించుకోవాలన్నారు.