SDPT: హుస్నాబాద్ విద్యుత్ డీఈ కార్యాలయం ముందు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ పిలుపుతో చేపట్టిన నిరవధిక సమ్మె మూడవ రోజుకు చేరింది. సంస్థలో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం, యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు. కన్వర్షన్ చేసి ఇతర ఉద్యోగుల్లా అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు.