సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని కుడకుడ వద్ద సోమవారం రాత్రి హనుమకొండ నుంచి వస్తున్న ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గమనించిన డ్రైవర్, కండక్టర్లు వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను మరో బస్సులో సూర్యాపేటకు సురక్షితంగా తరలించారు.