KDP: పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కడప జిల్లాలో పలువురు తహసీల్దార్లకు బదిలీలు చేస్తూ జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 14 మంది తహసీల్దార్లను వివిధ మండలాలకు బదిలీ చేయగా, మరో ఇద్దరు అధికారులను కొత్త నియమాకాల కోసం కలెక్టర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.