BDK: ఇల్లందు మున్సిపాలిటిలో పద్మశాలి సంఘ భవనం ఫ్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదివారం పాల్గొన్నారు. మన జాతి మనుగడకు, మన హక్కుల సాధనకు మనందరం కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఇంత బ్రహ్మాండంగా కుల సంఘం భవనం నిర్మించడం అభినందనీయం అని అన్నారు. అన్ని రంగాల్లో ప్రతి ఒక్కరూ ఎదగాలని ఆకాంక్షించారు.