MLG: జాతీయ రహదారి నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని మల్లంపల్లి మండల సాధన సమితి నాయకులు రాజు, హరీష్, పాషా ఆరోపించారు. ఇవాళ వారు మాట్లాడుతూ.. పనుల క్రమంలో వన్ వే అమలు చేస్తున్నప్పటికీ రోడ్డు డైవర్షన్, సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు.