KNR: హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని మున్సిపల్ ఛైర్ పర్సన్ సుహాసిని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె ఆసుపత్రిలోని వివిధ వార్డులను సందర్శించి, పారిశుద్ధ్య నిర్వహణను పర్యవేక్షించారు. అనంతరం రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఆరా తీశారు. రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.