KNR: శంకరపట్నం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని హుజూరాబాద్ డిప్యూటీ డీఎంహెచ్వో చందు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని సౌకర్యాలు, వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. గద్దపాకకు చెందిన గర్భిణి ప్రసవం కోసం రావడంతో ఆమెకు మనోధైర్యం కల్పించి, మెరుగైన సేవలందించాలని సిబ్బందిని ఆదేశించారు. వైద్యాధికారులు డా. శ్రావణి పాల్గొన్నారు.