జనగామ జిల్లా కేంద్రంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో నిన్న ఎరువుల బుకింగ్ యాప్ సేవల వినియోగంపై ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. గ్రామాల వారీగా ఏఈఓల ద్వారా మొబైల్ నంబర్ సవరణకు షెడ్యూల్ రూపొందించారు. పాత నంబర్ పనిచేయని రైతులు తమ క్లస్టర్ ఏఈఓను సంప్రదించి కొత్త నంబర్ నమోదు చేసుకోవాలని. దీంతో ఎరువుల బుకింగ్, సరఫరా వివరాలు తెలుస్తాయన్నారు.