MDCL: ఉప్పల్, నాచారం ప్రాంతాల్లో పరిశ్రమల కాలుష్యం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గుజరాత్ ఫుడ్స్ కంపెనీ వద్ద వ్యర్థాలను బహిరంగంగా కాల్చివేయడంతో గాలి కాలుష్యం పెరిగి స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇది TGPCB నిబంధనలకు విరుద్ధమని, వెంటనే అధికారులు తనిఖీలు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.