ASF: కాగజ్ నగర్ మండలం మండువ చెరువు నుంచి అనుమతి లేకుండా మట్టి తరలిస్తున్న 2 ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. MRO మధుకర్ ఆదేశాల మేరకు దాడులు నిర్వహించి, వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, నిబంధనలు ఉల్లంఘించి ఇసుక, మట్టి తరలిస్తే కఠిన చర్యలు తప్పవని MRO హెచ్చరించారు.