NRML: జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలు మార్చి 18 వరకు, పది పరీక్షలు ఏప్రిల్ 16 వరకు 47 కేంద్రాలలో జరుగుతాయని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని అన్నారు.