MNCL: గ్రామ, ఇళ్ల పరిసరాల పరిశుభ్రతను పాటించాలని దండేపల్లి మండలంలోని కొరివిచెల్మ గ్రామ కార్యదర్శి జునైద్ మహమ్మద్ కోరారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం గ్రామంలోని పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల పరిసరాలను పంచాయతీ కార్మికులతో శుభ్రం చేయించారు. ఆయన మాట్లాడుతూ.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే వ్యాధులు ప్రబలవని పేర్కొన్నారు.