MLG: జిల్లా కేంద్రంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ MLG పరిధిలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వేళలో పాల్గొనాలనుకునే వారు అప్సెట్ ధరలో 50% మొత్తం ధరావత్తుగా చెల్లించాలని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు సమయానికి హాజరై వేలంలో పాల్గొనాలని సూచించారు.