KMM: ఉమ్మడి జిల్లా ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల బదిలీలకు ఎట్టకేలకు లైన్ క్లియరైంది. సుమారు 200 మంది సిబ్బందికి స్థానచలనం కలగనుండగా, ఈ నెల 18న అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. సిబ్బంది తమ ఆప్షన్లను ఈ నెల 13 నుంచి 16 వరకు సమర్పించుకోవడానికి అవకాశం కల్పించారు.