MHBD: రంజాన్ సందర్భంగా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని మస్జిద్-ఏ-రేహ్మానియాలో ఆదివారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఫలహారాలు తినిపించి ఉపవాస విరమణ చేయించారు. రంజాన్ మాసం ఐక్యతకు ప్రతీక అని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, ముస్లిం పెద్దలు ఉన్నారు.