KNR: కేంద్ర మంత్రి బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర మండుటెండలోనూ ఉత్సాహంగా సాగుతోంది. గంగాధర మండలం సమీపంలో యాత్ర కొనసాగుతుండగా, వైద్య బృందం ఆయనకు రొటీన్ హెల్త్ చెకప్ నిర్వహించింది. ఎండ తీవ్రత దృష్ట్యా మంత్రి ఆరోగ్యాన్ని పరీక్షించిన వైద్యులు, తగు సూచనలు చేశారు. కొద్దిసేపు విశ్రాంతి అనంతరం ఆయన తిరిగి పాదయాత్రను ప్రారంభించారు.