KNR: ఇల్లందకుంట మండలం పాతర్లపల్లిలో జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని సర్పంచ్ బైరెడ్డి వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. పాడి రైతులు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుమారు 145 పశువులకు టీకాలు వేశారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.