నల్గొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం)లో బ్యూటీషియన్ కోర్సు మార్చి 4 నుంచి ప్రారంభంకానుంది. 8వ తరగతి పాసై, 18-35 ఏళ్ల లోపు ఉన్న మహిళలు దీనికి అర్హులు. ఆసక్తి గలవారు విద్యా అర్హత సర్టిఫికేట్, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో నేరుగా ప్రాంగణాన్ని సంప్రదించాలని మేనేజర్ అనిత తెలిపారు.