ఖమ్మం కలెక్టరేట్లో జరిగిన దిశ సమావేశంలో ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి కేంద్ర ప్రాయోజిత పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని నిన్న సూచించారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి పథకాల పురోగతిని సమీక్షించారు. జిల్లాలో 10 వేల ఇందిరమ్మ ఇళ్లులు స్లాబ్ దశకు చేరాయని మధ్యాహ్న భోజన నాణ్యత జాతీయ రహదారి పనులు వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.