VZM: జనవరి నెల నుంచి ప్రణాళికబద్దంగా నిర్వహిస్తున్న రీ సర్వే, పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని ఇచ్చిన గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రీ సర్వే, పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీపై ఆర్డీవోలు, తహసీల్దార్ల, సర్వే సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.