SDPT: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మా అమ్మ కల్వకుంట్ల కవిత సిద్దిపేట నుంచి పోటీ చేస్తుందని కవిత కుమారుడు ఆదిత్య స్పష్టం చేశారు. సిద్దిపేటలోని ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా జాగృతి నాయకులు కలిసి ఆదిత్యను సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. మే నెలలో కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు.