HNK: హసన్ పర్తి మండలం అర్వపల్లి గ్రామానికి చెందిన మంచాల కమల అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుంచి మంజూరైన రూ.5 లక్షల విలువైన ఎల్ఓసి కాపీని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు బుధవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రజలు ఖరీదైన ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పుల పాలుకాకుండా, ప్రభుత్వ ఉచిత వైద్యం అందిస్తుందన్నారు.