ADB: నార్నూర్ మండల కేంద్రంలో నీటి ఆయోగ్ పథకం కింద నూతనంగా నిర్మించిన సంగ్రహాలయం (మ్యూజియం)ను ఈనెల 18వ తేదీన ప్రారంభిస్తున్నట్లు ఎంపీడీవో పుల్లారావు తెలిపారు. ఇందులో ఏర్పాటు చేసే గిరిజనుల పురాతన వస్తువులపై ప్రజలకు అవగాహన కలుగుతుందన్నారు. అనంతరం తాడిహత్నూర్ గ్రామంలో దాల్ మిల్ ప్రారంభిస్తామన్నారు. దీంతో ప్రజలు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.