GDWL: వైద్య సిబ్బంది సక్రమంగా విధులకు హాజరై గ్రామీణులకు వైద్య సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి అని ఎల్కూర్ గ్రామ సర్పంచ్ పి. వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం మల్దకల్ మండలం ఎల్కూర్ గ్రామంలోని పల్లె బస్తీ దవాఖానను ఆయన తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది లేకపోవడంతో మండల వైద్యాధికారిని సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.