ADB: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ సూచించారు. శనివారం పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షి షాతో కలిసి మాట్లాడారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.